Open School Admissions News: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు 28 వరకు గడువు పెంపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్ ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. రూ.200 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు అవకాశం ఉందన్నారు.
గుడ్న్యూస్ భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు: Click Here
ఓపెన్ స్కూల్ దరఖాస్తులను ఆన్లైన్లో చేయించుకున్న తర్వాత వచ్చిన రిఫరెన్స్ నంబర్ ఆధారంగా ప్రవేశ ఫీ జులను అభ్యర్థులు స్వయంగా వెళ్లి ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు సమీపంలోని స్టడీ సెంటర్లకు వెళ్లి కోఆర్డినేటర్లను సంప్రదించాలని కోరారు. మద్యలో చదువు మానేసినవారు, గృహిణులు, వ్యాపారు లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశ కార్యకర్తలు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యాభ్యాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ తిరుమల చైతన్య సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)