ITI Admissions: 28న నాలుగో విడత కౌన్సెలింగ్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో సెప్టెంబ‌ర్ 28న నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్‌ రవీంద్రరెడ్డి తెలిపారు.

ఆయన సెప్టెంబ‌ర్ 18న‌ విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబ‌ర్ 28న జిల్లాలోని 9 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో, సెప్టెంబ‌ర్ 30వ తేదీన 10 ప్రైవేట్‌ కళాశాలల్లో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు.

చదవండి: Online Course on AI: మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ కోసం కృత్రిమ మేధ కోర్సు.. కోర్సు స‌మ‌యం, ఇత‌ర వివ‌రాల కోసం

సెప్టెంబ‌ర్ 26వ తేదీ లోపు www. iti. ap. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 77999 33370, 77992 01479ను సంప్రదించాలని కోరారు.

#Tags