ITI Admissions: 28న నాలుగో విడత కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సెప్టెంబర్ 28న నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రరెడ్డి తెలిపారు.
ఆయన సెప్టెంబర్ 18న విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 28న జిల్లాలోని 9 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో, సెప్టెంబర్ 30వ తేదీన 10 ప్రైవేట్ కళాశాలల్లో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 26వ తేదీ లోపు www. iti. ap. gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 77999 33370, 77992 01479ను సంప్రదించాలని కోరారు.
#Tags