UPSC ESE 2025 Exam: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ),‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 232
ఖాళీల విభాగాలు
- సివిల్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణత లేదంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్ విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: జనవరి 1, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 09, 2025
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 08, 2024