PG admissions news: PGలో ప్రవేశానికి దరఖాస్తులు

PG admissions news

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లు, కళాశాలలలో సెకండియర్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ (లేటరల్‌ ఎంట్రీ)లో ప్రవేశానికి ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య వై. శ్రీనివాసరావు తెలిపారు.

Students 10000 Rupees Scholarship News: Click Here

నాలుగేళ్ల యూజీ ఆనర్స్‌ డిగ్రీని పూర్తి చేసిన విద్యార్థి 3వ, 4వ సెమిస్టర్‌లలో పరిశోధనతో లేదా 3వ సెమిస్టర్‌లో మాత్రమే కోర్సు వర్కుతో, 4వ సెమిస్టర్‌లో ప్రోగ్రామ్‌ వర్క్‌తో 2 లేదా 3 సెమిస్టర్‌లో లేటరల్‌ ఎంట్రీకి అర్హుడన్నారు. గురువారం నుంచి ఈ నెల 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 25వ తేదీన కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. యూనివర్సిటీతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు మంజూరైన 20 శాతం సూపర్‌ న్యూమరీ సీట్ల విభాగాలు/కళాశాలల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags