NSS Students: విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు కోఆర్డినేటర్‌ ప్రవీణ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

కొంచరియలు, విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఏ విధంగా రక్షించాలని అనే అంశంపై హిమాచల్‌ప్రదేశ్‌లో 10 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి: Free Training: పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత శిక్షణ

ఈ మేరకు క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు సెప్టెంబ‌ర్ 20న‌ పీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ప్రవీణ పీయూలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడేందుకు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

#Tags