APPSC: గ్రూప్‌–1 మెయిన్స్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్‌ పరీక్ష కోసం మార్చా 15లోగా ఆప్షన్లు నమోదు చేయాలని Andhra Pradesh Public Service Commission (APPSC) మార్చి 3న ఒక ప్రకటనలో సూచించింది.
గ్రూప్‌–1 మెయిన్స్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే..

మాధ్యమం, పోస్టు ప్రిఫరెన్సు, జోనల్‌ ప్రిఫరెన్సు, పరీక్షా కేంద్రం తదితరాలకు సంబంధించి ఆప్షన్లను నమోదు చేయాలని కోరింది. నోటిఫికేషన్‌లోని పేరా 1.8లోని అంశాల ప్రకారం అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను తెలియజేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను 
https:// psc. ap. gov.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. ఆప్షన్ల నమోదులో విఫలమయ్యే అభ్యర్థులకు.. అందుబాటులో ఉన్న వివరాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. 

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

#Tags