School Inspection : సిల‌బ‌స్‌ను స‌కాలంలో పూర్తి చేయాలని డీఈఓ ఆదేశం..

డీఈఓ దామలచెరువు జెడ్పీ హైస్కూల్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు.

పాకాల: ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్‌ పూర్తి చేయాలని డీఈఓ శేఖర్‌ తెలిపారు. శుక్రవారం డీఈఓ దామలచెరువు జెడ్పీ హైస్కూల్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇంటి వద్దే పునశ్చరణ చేసుకుని వచ్చి, విద్యార్థులకు పాఠం చెప్పాలన్నారు. విద్యార్థులు సైన్స్‌ లో ప్రాజెక్ట్‌ వర్క్‌లు సరిగ్గా చేయలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.

CMs Overseas Scholarship: విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు

అలాగే మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని శుక్రవారం డీఈఓ శేఖర్‌ సందర్శించారు. పిల్లలతో ముచ్చటించి వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా ? లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గతంలో భవిత కేంద్రలోని విద్యార్థులకు 5 ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సమగ్రశిక్ష సహాయ అకడమిక్‌ అధికారి మధుసూదన్‌, ఎంఈఓ బాబ్జి, హైస్కూలు హెచ్‌ఎం నాగరాజ, ఐఈఆర్పీలు మునికృష్ణరెడ్డి, కెఎస్‌ఎల్‌. సుందరి తదితరులు పాల్గొన్నారు.

#Tags