జూలై 5న పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్షణమే పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
సర్కార్ బ డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 5న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ‘మన ఊరు–మన బడి’కి నిధులు కేటాయించాలని ఏబీవీపీ కార్యదర్శి ప్రవీణ్రెడ్డి కోరారు. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, డీఈవో, ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Published date : 02 Jul 2022 06:42PM