అతి తక్కువ వయస్సులోనే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాజువాకకు చెందిన ఒక బాలిక.
పాలూరి టానీషా
12 ఏళ్లకే పదో తరగతి పరీక్ష రాసిన పాలూరి టానీషా 525 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. 7వ తరగతి నుంచి నేరుగా పదో తరగతి పరీక్షలకు హాజరై ఈ విజయం సాధించింది. గాజువాకలోని జోగవానిపాలెం దరి సాయినగర్లో తన తండ్రి పాలూరు లక్ష్మణస్వామి నిర్వహిస్తున్న పాఠశాలలో ఆమె చదువుతోంది.