Skip to main content

ఉన్నతి పథకంతో ప్రతి విద్యార్థికీ మేలు

కంప్లి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రత్యేకించి అమలు చేసిన ఉన్నతి పథకం జిల్లాలోని కంప్లి నియోజకవర్గంలో ప్రప్రథమంగా ప్రారంభం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే జేఎన్‌ గణేష్‌ తెలిపారు.
Every student is better off with the advanced scheme
ఉన్నతి పథకంతో ప్రతి విద్యార్థికీ మేలు

శుక్రవారం పట్టణంలోని చంద్రకళ థియేటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని నాడా కార్యాలయంలో అందించాలన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే సిద్ధం చేస్తే విద్యార్థులకు అందుతాయన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు సమయం వృధా చేసుకోకుండా ఉన్న చోటనే సౌకర్యం పొందవచ్చన్నారు. అనంతరం ఏసీ హెమంత్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం కురుగోడులో 5308 మంది విద్యార్థులు, కంప్లి తాలూకాలో 3433 మంది విద్యార్థులు కలిపి మొత్తం 8741 మంది విద్యార్థులు అర్జీలు అందించారన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ గౌసియాబేగం, ఉపతహసీల్దార్‌ పాల్గొన్నారు.

Published date : 05 Aug 2023 04:26PM

Photo Stories