Skip to main content

Chess: ఢిల్లీ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన ఆటగాడు?

Arjun Erigaisi

భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో మార్చి 29న ముగిసిన ఢిల్లీ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ–2022లో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి మూడో స్థానాన్ని దక్కించుకోగా... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ డి.గుకేశ్‌ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 10 రౌండ్ల తర్వాత అర్జున్, గుకేశ్, హర్ష భరతకోటి 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. అర్జున్‌కు ‘టాప్‌’ ర్యాంక్‌ ఖాయమవ్వగా ... గుకేశ్‌కు రెండో స్థానం, హర్షకు మూడో స్థానం లభించాయి. విజేతగా నిలిచిన అర్జున్‌కు రూ. 4 లక్షలు ... రన్నరప్‌ గుకేశ్‌కు రూ. 3 లక్షల 50 వేలు.. మూడో స్థానం పొందిన హర్షకు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ ఇటీవల జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

Badminton: స్విస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?​​​​​​​
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఢిల్లీ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ–2022లో చాంపియన్‌గా నిలిచిన ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 28
ఎవరు    : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : మెరుగైన స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినందున..

Men's Doubles Title: భారత క్రీడాకారుడు సాకేత్‌ మైనేని ఏ క్రీడలో ప్రసిద్ధుడు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Mar 2022 05:48PM

Photo Stories