Skip to main content

Shankaracharya Statue: ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రాంరభించారు?

Adi Guru Shankaracharya Statue

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రప్రయాగ్‌ జిల్లా కేదార్‌నాథ్‌లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని, ఆయన విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 5న శంకుస్థాపన చేశారు. అలాగే కేదార్‌నాథ్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన పునర్నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని కాలడి గ్రామంలో జన్మించిన ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.

ఎక్కడ జరిగిన దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 4న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మారుతున్న ప్రపంచం, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా... దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
 

చ‌ద‌వండి: విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పునర్నిర్మించిన ఆది శంకరాచార్య విగ్రహావిష్కరణ
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : కేదార్‌నాథ్, రుద్రప్రయాగ్‌ జిల్లా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Nov 2021 03:05PM

Photo Stories