Skip to main content

Engineering College: అర్ధ‌రాత్రి కాలేజీలోంచి ల‌క్ష‌ల న‌గ‌దు చోరీ...ఎలా?

కాలేజీలో క‌ట్టే ఫీజులు, మేనేజ్మెంట్ డ‌బ్బుతో స‌హా లావ‌ర్ లోనే ఉండ‌డంతో అర్ధ‌రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాలేజీలోంచి డ‌బ్బులు దొంగ‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం...
around 12 lakhs got stolen in hyderabad engineering college
around 12 lakhs got stolen in hyderabad engineering college

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంజినీరింగ్‌ కాలేజీలో దొంగలు పడి కాలేజీలో ఉన్న నగదు చోరీ చేసిన ఘటన నాగోలు పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. నాగోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తట్టిఅన్నారంలోని శ్రేయాస్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో విద్యార్థులను నుంచి కాలేజీ ఫీజులు, టూషన్‌ ఫీజుల డబ్బు రూ. 12, 84 లక్షల అకౌంటెంట్‌ కులవల్లి రమేష్‌రావు తీసుకుని కాలేజీలోని ముడో అంతస్తులో తన లాకర్‌లో మంగళవారం సాయంత్రం భద్రపరిచాడు.

Aditya L1 Live updates: ఆదిత్య–ఎల్‌1 సూర్యునిపై చేసే పరిశోధనలు ఇవే..

అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీలో ప్రవేశించి నగదు ఉన్న లాకర్‌ను కటర్‌తో కట్‌ చేసి లాకర్‌లో ఉన్న రూ. 12. 84 లక్షల నగదు చోరీ చేసుకుని పారిపోయారు. బుధవారం కాలేజ్‌ వెళ్లిన అకౌంటెంట్‌ తన గదిలోకి వెళ్లి చూసేసరికి లాకర్‌ పగల గొట్టి అందులో ఉన్న రూ. 12.84 లక్షల నగదు కనిపించలేదు. దీంతో బుధవారం రమేష్‌రావు నాగోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నాగోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Published date : 01 Sep 2023 10:58AM

Photo Stories