Skip to main content

AP Gurukulam Notification 2024: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Apply online by 31st for Gurukula Vidyalaya admissions   AP Gurukulam Notification 2024   Notification for Maidan area Gurukula Vidyalaya admissions

సాక్షి,పాడేరు: మైదాన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కలెక్టర్‌ విజయసునీత తెలిపారు. ఈమేరకు నోటిఫికేషన్‌ ప్రచార కరపత్రాలను మంగళవారం ఆమె తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

భీమిలి, అచ్యుతాపురం బాలికల గురుకుల విద్యాలయాలు, నర్సీపట్నం బాలుర గురుకుల పాఠశాలలో 5,6,7,8 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్లు ఉన్నాయన్నారు.అలాగే విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అల్లూరి జిల్లాలోని విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకోవచ్చన్నారు.

సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 31వతేదీ లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని తరగతులకు సంబంధించి వచ్చే నెల 25న పాడేరులో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌జేసీ–2024 సమన్వయకర్త సంధ్యాభార్గవి తదితరులు పాల్గొన్నారు.

Published date : 13 Mar 2024 04:35PM

Photo Stories